నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జిల్లా వ్యాప్తంగా పక్కాగా అమలు చేస్తున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ అన్నారు. లాక్డౌన్ అమలు తీరును నగరంలో బుధవారం ఆయన పర్యవేక్షించారు. నెహ్రూపార్క్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును పరిశీలించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటికి రావాలని, లాక్డౌన్ స మయంలో బయటికి వస్తే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నదన్నారు. పెట్రోలింగ్ చేస్తున్నామని, లాక్డౌన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణాలు చేయాలనుకునేవారు, బిజినెస్ పాస్లు అవసరం ఉన్నవారు అదనపు డీసీపీ (అడ్మిన్) టి.స్వామి (94906 19669), సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రాజరాజేంద్ర (94407 95472), స్పెషల్బ్రాంచ్(94906 18000), పోలీసు కంట్రోల్ రూం(08462226090)ను సంప్రదించాలని ఆయన సూచించారు.
డిచ్పల్లిలో వ్యాపారులు 10 గంటల తరువాత దుకాణాలను మూసిఉంచారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ను తహసీల్దార్ శ్రీనివాస్ రావు, డిచ్పల్లి ఇన్చార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. ధర్పల్లి మండలంలో లాక్డౌన్ ను ఇన్చార్జి ఎస్సై నరేశ్ పర్యవేక్షించారు. ఉదయం 10 గంట ల తర్వాత వ్యాపారసముదాయాలను మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోటగిరి మండలంలో ఉదయం పది గంటల తరువాత దుకాణాలను అధికారులు మూసివేయించారు. లాక్డౌన్ను పోలీసులు పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను హెచ్చరించారు. వర్ని మండలంలోని ఆయా గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఇందల్వాయిలో ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ కొనసాగింది. ఎస్సై శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది.
మండలంలో లాక్డౌన్ను ఎస్సై సాయారెడ్డి పర్యవేక్షించారు. రుద్రూర్, చందూర్ మండలాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. బోధన్ పట్టణంలో ఉదయం 10 గంటల నుంచి దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేశారు. బస్టాండ్ నుంచి బస్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. బోధన్ ఏసీపీ రామారావు, బోధన్ టౌన్ సీఐ రామన్, ఎస్సైలు పట్టణంలో లాక్డౌన్ అమలుతీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీస్ వ్యాన్లతో పట్టణంలోని ప్రధాన రహదారులపై కవాతు చేశారు. మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో లాక్డౌన్ సంపూర్ణంగా సాగింది. తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, మోర్తాడ్, కమ్మర్పల్లి ఎస్సైలు సురేశ్, శ్రీధర్గౌడ్ లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. నిబంధనలను పాటించకుండా బయటికి వచ్చిన వాహనదారులకు ఫైన్ వేశారు. వేల్పూర్ మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా సాగింది. గ్రామంలోని బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలను తహసీల్దార్ సతీశ్రెడ్డి, ఎస్సై భరత్రెడ్డి పరిశీలించారు.
భీమ్గల్లో ఉదయం పది గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటికి రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బోధన్ మండలంలోని సాలూరా చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను అనుమతించకుండా పోలీసులు చెక్పాయింట్ను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతేనే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద వంతెనపై రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. చెక్పోస్టును రెంజల్ తహసీల్దార్ రామ్చందర్, ఎస్సై మురళి పరిశీలించారు. సాటాపూర్ తెలంగాణ చౌరస్తా, రెంజల్ తదితర ప్రాంతాల్లో లాక్డౌన్ సాగింది. లాక్డౌన్ నిబంధనలను ధిక్కరించిన వ్యక్తులపై చర్యలు తప్పవని రెంజల్ ఎస్సై హెచ్చరించారు. నందిపేట్ మండలంలో లాక్డౌన్ను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రోడ్లపైకి జనం రాకుండా చర్యలు తీసుకున్నారు. ఏర్గట్ల మండలంలో ఎస్సై ఆసిఫ్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. మాక్లూర్తోపాటు ఆయా గ్రామాల్లో లాక్డౌన్ అమలుచేశారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగినట్లు ఎంపీడీవో సక్రియానాయక్ తెలిపారు.