ఖలీల్వాడి, జూన్ 11: దేశంలోనే అత్యం త బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నగరంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రజలు పార్టీని గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు అధికారం కట్టబెట్టారని చెప్పారు. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించిందన్నారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి, జిల్లా కేంద్రానికి వచ్చిన వారికి కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో మహిళా కార్యకర్తలు, ఇతరులకు ఏవిధమైన వసతులు కల్పించాలో ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించామని చెప్పారు. పార్టీ కార్యాలయం అద్భుతంగా ఉందన్నారు. పార్టీ కార్యాలయాన్ని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో అన్నదాన కార్యక్రమాన్ని తనకు శక్తి ఉన్నంత వరకూ కొనసాగిస్తానన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రెడ్కో చైర్మన్ అలీం, నాయకులు న్యాలం కిషన్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ భవనాన్ని పరిశీలించిన మంత్రి
జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ భవనాన్ని మంత్రి ప్రశాంత్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. త్వర లో సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని, పనులను త్వరగా పూర్తిచేయాలని కాం ట్రాక్టర్కు, నాయకులకు సూచించారు. నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు తదితరులు ఉన్నారు.