నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 11 : రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దులో వేర్వేరుగా మంగళవారం 53 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. 14 రోజుల పాటు హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించడంతోపాటు మెడికల్ కిట్లను అందజేశామన్నారు. ఆర్మూర్లోని ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని, హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12 మందికి, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త మోహన్ తెలిపారు.
మాక్లూర్ మండలకేంద్రంలోని పీహెచ్సీతోపాటు కల్లడి పీహెచ్సీలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. మాక్లూర్లో 35 మందికి టెస్టులు నిర్వహించగా ముగ్గురికి, కల్లడిలో 37 మందికి టెస్టులు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 58 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్ పవార్ తెలిపారు. 62 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆయన తెలిపారు. బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ పరిధిలో ఎనిమిది మంది కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. 36 మందికి టెస్టులు నిర్వహించామన్నారు.
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు వెల్లడించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 91 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 11 మందికి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 16 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 42 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తెలిపారు.
బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో మంగళవారం 285 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు. రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 20 మందికి టీకాలు వేసినట్లు దవాఖాన వైద్యాధికారి డాక్టర్ ఆయేషా తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం 36 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని మండల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్ తెలిపారు. మోస్రా మండల కేంద్రంలో 59 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి కరో నా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు.
86 మందికి రెండో డోస్ టీకా వేసినట్లు పేర్కొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించ గా.. ఒకరికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ నవీన్ తెలిపారు. 33 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. వర్ని మండల కేం ద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 48 మందికి కరోనా నిర్ధా రణ పరీక్షలు నిర్వహించగా.. 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 91 మందికి కరోనా వ్యాక్సి న్ వేసినట్లు పేర్కొన్నారు. కోటగిరి మండలంలో పలువురికి కరోనా టెస్టులు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిం దని డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ పీహెచ్సీలో 40 మందికి టెస్టులు చేయగా ఏడుగురికి, కోటగిరిలో 40 మందికి టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని పేర్కొ న్నారు. మోర్తాడ్ సీహెచ్సీలో మంగళవారం 51 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, 65 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ రవికుమార్ తెలిపారు.
చౌట్పల్లి పీహెచ్సీలో 27 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని, 60 మందికి వ్యాక్సిన్ వేశామని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. ఏర్గ ట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా టెస్టు లు కొనసాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రా మాల్లో మంగళవారం తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదైన ట్లు మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్ తెలిపారు.