నిజామాబాద్ లీగల్, జూలై 10 : వ్యక్తుల మధ్య విభేదాలు వ్యవస్థకు చేటు చేస్తాయని, వాటి అంతానికి ముగింపు పలకాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కొక్కుల సాయి రమాదేవి అన్నా రు. వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యవస్థలు మనజాలవన్నారు. ఘర్షణలు, హింసా ఘటనలు దేశ ప్రగతికి నిరోధకాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్ర సంగించారు. శారీరక, మానసిక హింసకు గురై న బాధితులు లోక్ అదాలత్ ద్వారా రాజీ మా ర్గాన పరిష్కరించుకుని సమాజం పట్ల బాధ్యతగా వ్యవరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజా న్యాయపీఠాల పరమార్థం విస్తృత ప్రజా ప్రయోజనాలేనని తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సివిల్, క్రిమినల్ కేసుల్లో ఉన్న కక్షిదారులపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉం టాయన్నారు.
చట్టబద్ధమైన పరిష్కారంతో ఆ యా కుటుంబాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నా రు. అనేక న్యాయ విషయాల్లో, ప్రగతి పథకాల అమలులో న్యాయ వ్యవస్థతో కలిసి నడిచామన్నారు. ఉమ్మడి న్యాయ ఫలాలు సాధించామన్నా రు. అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి మాట్లాడు తూ.. సమష్టి ప్రయోజనాల పరిరక్షణకు న్యాయ సేవా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఒక టీమ్ వర్క్గా అందరం కలిసి న్యాయ సేవా సంస్థలో బాధ్యతలు పంచుకుంటున్నామని అదనపు పోలీ సు కమిషనర్ అరవింద్, నగర పాలక సంస్థ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్, అదనపు జిల్లా జడ్జిలు నర్సారెడ్డి, రత్నా పద్మావతి, షాకల్ జహాన్ సిద్ధిఖీ, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, చందన, సౌందర్య, గిరిజ, భవ్య, బార్ అధ్యక్షుడు రాజారెడ్డి, పీపీ మధుసూదన్రావు, గంగారెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ట్రైనీ కలెక్టర్ మకరంద్, ఎస్బీఐ అధికారులు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, జీవీ. బలరాం, దినేశ్, న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, మాణిక్రాజ్, బార్ ప్రధాన కార్యదర్శి ఎర్రం విఘ్నేశ్ పాల్గొన్నారు.
కేసును ఉపసంహరించుకున్న ఎమ్మెల్యే షకీల్
నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన 14 మందిపై 29 నవంబర్ 2016లో పెట్టిన క్రిమినల్ కేసును వర్చువల్ హియరింగ్ ద్వారా బోధన్ ఎమ్మెల్యే షకీల్ పాల్గొని ఉపసంహరించుకున్నారు.
ఉమ్మడి అంగీకారం మేరకు అవార్డుల జారీ
జాతీయ లోక్అదాలత్లో సివిల్, రాజీ పడదగిన కేసులను కక్షిదారుల ఉమ్మడి అంగీకారం మేరకు పరిష్కరించి అవార్డులు జారీ చేశామని సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా న్యాయ పరిధిలోని ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3240 సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.