ఖలీల్వాడి జూలై 9 : నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. కరోనాను అంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం టీకాల పంపిణీని వేగవంతం చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ వేసుకోవడమేనని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తం గా మొదటి, రెండో డోస్లు కలిపి 3,03,220 మందికి వేసినట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. జిల్లా వ్యా ప్తంగా అన్ని వ్యాక్సిన్ కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 15న టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో టీకా తీసుకోవడానికి ప్రజలకు ముందుకు రాలేదు. ప్రభుత్వం టీకా ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించింది. దీంతో ప్రజలు టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదట ఫ్రంట్లైన్ వారియర్స్కు, 60 ఏండ్లు పైబడిన వారికి, రెండోదశలో 45 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలను వేస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేటు దవాఖానల్లో ఈ సౌకర్యాన్ని కల్పించారు.
పకడ్బందీగా వ్యాక్సినేషన్
జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. అన్ని సెంటర్లలో టీకాలు వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యు ల పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది.
-బాలనరేంద్ర ,డీఎంహెచ్వో , నిజామాబాద్