డిచ్పల్లి, జూలై 8 : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సతీమణి శోభారాణి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఆమె మృతి చెందిన విష యం తెలిసిందే. నగర శివారులోని పాంగ్రా బ్యాంకు కాలనీ సమీపంలో ఉన్న వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించగా.. చిన్న కుమారుడు బాజిరెడ్డి అజయ్కుమార్ చితికి నిప్పంటించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డితో పాటు కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, జాజాల సురేందర్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు పాల్గొన్నారు. శోభారాణి పార్థివదేహానికి వారు నివాళులర్పించారు. నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఈగ సంజీవ్రెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రవి, ఏసీపీ వెంకటేశ్వర్లు, కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహిపాల్రెడ్డి, రూరల్ నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ మం డల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు,రూరల్, సీఐలు, ఎస్సైలు, కార్యకర్తలు అంత్యక్రియలకు హాజరయ్యారు.
శోభారాణి పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాస గృహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకుని శోభారాణి పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డిని, కుటుంబీకులను ఆమె పరామర్శించి ఓదార్చారు. పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డిని పరామర్శించిన వారిలో కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, సీపీ కార్తికేయ ఉన్నారు.
బాజిరెడ్డికి మంత్రి అల్లోల, ఎమ్మెల్యే రామన్న పరామర్శ
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం సాయం త్రం పరామర్శించారు.