నిజామాబాద్ రూరల్, జూన్ 6 : పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో గుండారం, సారంగాపూర్, కొత్తపేట, ముత్తకుంట తదితర గ్రామాలకు చెందిన బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద పుష్కలంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు జలంధర్గౌడ్, ప్రవీణ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎండీ అక్బర్ నవాజుద్దీన్, జమీర్ ఖాన్, రామ్నగర్ ఎంపీటీసీ స్వామి తదితరులు పాల్గొన్నారు.
చందూర్లో..
చందూర్, జూన్ 6: మండలంలోని మేడ్పల్లి గ్రామం నడిమి తండాకు చెందిన బీర్యాకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.33 వేల ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కును బీర్యా కుమారుడు గంగారామ్నకు సర్పంచ్ లాకావత్ రవి ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యాంరావు, బట్టు మోహన్, కవిత, గబ్బర్ సింగ్, తులసీరాం పాల్గొన్నారు.