భీమ్గల్, జూలై 4: పట్టణ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ ప్రజలను కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా దాతల సహకారం కోసం మున్సిపల్ కార్యాలయంలో పట్టణానికి చెందిన ప్రముఖులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని కోరా రు. అనంతరం ఎనిమిదో వార్డు లో కౌన్సిలర్ సతీశ్గౌడ్తో కలిసి పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఆర్ఐ సాయిలు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆర్మూర్లో జోరుగా పట్టణప్రగతి ..
ఆర్మూర్, జూలై 4 : ఆర్మూర్ బల్దియా పరిధిలో పట్టణప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో ఆదివారం పర్యటించారు. విద్యుత్, తాగునీరు, వైద్యం తదితర సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని కౌన్సిలర్లకు సూచించారు. అనంతరం మామిడిపల్లిలోని మహిళా సమాఖ్య నర్సరీ, పిప్రి రోడ్డులో ఉన్న ఫారెస్ట్ నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట కౌన్సిలర్లు సంగీతా ఖాందేశ్ శ్రీనివాస్, వరలక్ష్మీలింబాద్రిగౌడ్, ఆకుల రాము, తాటి హన్మాండ్లు, గంగామోహన్ చక్రు, పొద్దుటూరి మురళిధర్రెడ్డి, పాలెపు లతారాజు, అయ్యప్ప లావణ్య శ్రీనివాస్, బారడ్ రమేశ్, తలారి మీనా చందు, సుంకరి ఈశ్వరీరంగన్న, లిక్కి శంకర్, టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, మున్సిపల్ డీఈ భూమేశ్వర్, ఏఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్ తదితరులు ఉన్నారు. మామిడిపల్లి పద్మశాలీ సంఘం ఆవరణలో సంఘ సభ్యులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో ఆక్రమణల తొలగింపు
బోధన్, జూలై 4: పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఆక్రమణలను మున్సిపల్ అదికారులు ఆదివారం తొలగించారు. పట్టణప్రగతిలో భాగంగా ఈనెల 3న కలెక్టర్ నారాయణరెడ్డి పర్యటించి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రామలింగం, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి జూనియర్ కళాశాల నుంచి శక్కర్నగర్ చౌరాస్తా వరకు రోడ్డుపక్కన అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగింపజేశారు. మిగతావి కూడా తొలగిస్తామని కమిషనర్ తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, కందుకాల శ్రీకాంత్ గౌడ్, నాయకుడు గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
ఖలీల్వాడ, జూలై 4: నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్లో పట్టణ ప్రగతి నిర్వహించారు. మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొని స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు.