నిజామాబాద్రూరల్/డిచ్పల్లి/ధర్పల్లి/ఇందల్వాయి/ మా క్లూర్/ఎడపల్లి (శక్కర్నగర్)/ రెంజల్/ఆర్మూర్, జూన్ 1: వానకాలం పంట సాగు కోసం రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారులు, పోలీసులు డీలర్లను హెచ్చరించారు. ఆయా మండలాల్లోని విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే డీలర్లతో మండల వ్యవసాయాధికారులు మంగళవారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి మాట్లాడారు. ఆరుగాలం కష్టించే రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించి వారు అధిక దిగుబడులు సాధించేలా తోడ్పాటును అందించాలని సూచించారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట సాగుచేసిన రైతన్న తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలు, పురుగుల మందులను విక్రయించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
రూరల్ మండల ఏడీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయాధికారిణి హీరాజాదవ్, రూరల్ ఎస్హెచ్వో లింబాద్రి, ఏఈవోలు స్వాతిలత, రాకేశ్, జ్ఞానేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం నడ్పల్లి రైతువేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఏవో రాంబాబు, ఎస్సై ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ధర్మారం(బీ) గ్రామంలోని విత్తన దుకాణాల్లో స్టాక్ వివరాలు, రిజిష్టర్లను ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. ధర్పల్లి రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ధర్పల్లి సీఐ శ్రీశైలం, ఏవో ప్రవీణ్ పాల్గొన్నారు. షాపుల్లో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, సోయాబీన్ విత్తన విక్రయాలు నిర్వహించే డీలర్లు స్టాక్ వివరాలను వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందల్వాయిలో ఏవో స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సై శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం మం డల కేంద్రంలోని ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాన్ని వా రు తనిఖీ చేసి స్టాక్ రికార్డులను పరిశీలించారు. మా క్లూర్ పోలీసు స్టేషన్లో ఏ ర్పాటు చేసిన సమావేశం లో ఎస్సై రాజారెడ్డి, ఏవో పద్మ పాల్గొన్నారు. ఎడపల్లి పోలీసు స్టేషన్లో నిర్వ హించిన కార్యక్రమంలో వ్యవసాయాధికారి సిద్ధి రా మేశ్వర్, ఎస్సై ఎల్లాగౌడ్ పా ల్గొన్నారు. రెంజల్ మండ లంలోని సాటాపూర్, బో ర్గాం గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్సై మురళి పాల్గొన్నారు. మోర్తాడ్లో పోలీసు స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై సురేశ్, ఏవో లావణ్య పాల్గొన్నారు. ఆర్మూర్ ఎంపీపీ కా ర్యాయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ ఏడీఏ హరికృష్ణ, ఏసీపీ రఘు, సీఐ సైదేశ్వర్ పాల్గొన్నారు.