భానుడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఉపశమన చర్యలు సిద్ధమవుతున్నారు. పలువురు పాతకూలర్లకు మరమ్మతులు చేయిస్తుండగా కొందరు కొత్తవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారులు కూలర్లకు సంబంధించిన స్పేర్పార్ట్స్తో పాటు నూతన కూలర్లను దిగుమతి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ప్రజలకు వేసవికాలంలో చల్లదనం ఇచ్చేందుకు మార్కెట్లో అనేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా సామాన్యులకు అందుబాటు ధరల్లో లభించేవి కూలర్లే.. సీజనల్ వ్యాపారం కావడంతో ఇతర వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులు చాలా మంది కూలర్లు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెరిగిన అమ్మకాలు..
గత ఏడాది కరోనా ప్రభావం చూపడంతో ప్రజలు కూలర్లపై ఆసక్తి చూపలేదు. దీంతో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగింది. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉపశమనం పొందేందుకు కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో కూలర్ల వ్యాపారం బాగుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-సిరికొండ, ఏప్రిల్ 1
సామాన్యులకు అందుబాటులో ధరలు..
సామాన్యులకు అందుబాటు ధరల్లో కూలర్లు ఉన్నాయి. గత ఏడాది లాక్డౌన్ ప్రభావంతో ప్రజలు కూలర్లు కొనుగోలు చేయలేదు. ఎండ తీవ్రత ఇంకా పెరగకముందే కొనుగోలు చేస్తే తక్కువ ధరలకు లభ్యమవుతాయి.
-ప్రేమ్కుమార్, వ్యాపారి
కూలర్ తప్పనిసరి అయ్యింది..
వేసవిలో ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే కూలర్ వినియోగం తప్పనిసరిగా మారింది. వ్యాపారం నిర్వహించే చోట, ఇంట్లో కూలర్ ఉండాల్సిందే. మన బడ్జెట్కు అనుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో కూలర్లు లభ్యమవుతున్నాయి.
-మహేందర్, వినియోగదారుడు
ఇవీ కూడా చదవండీ..
మరోసారి స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రధాని పర్యటన.. డ్రోన్లపై నిషేధం