ముప్కాల్, ఏప్రిల్ 1: మండలంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించడంతో రైతుల బాధలు తీరనున్నాయి. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో మండలంలోని వెంచిర్యాల గ్రామానికి మరింత నాణ్యమైన విద్యుత్ సేవలు అందనున్నాయి. బోరుబావుల కింద పంటలు సాగుచేస్తున్న రైతులకు మరింత మెరుగైన విద్యుత్ అందనుంది. దీంతో వెంచిర్యాల్ గ్రామ రైతుల ఎన్నో ఏండ్ల కల నెరవేరుతోంది. రెం జర్ల గ్రామ సబ్స్టేషన్ నుంచి వెంచిర్యాల్కు విద్యుత్ సేవలు అందుతున్నాయి. తమ గ్రామానికి సబ్స్టేషన్ అందుబాటులోకి రానుండడంతో వెంచిర్యాల్ వాసులకు విద్యుత్ సేవలతోపాటు మరింత నాణ్యమైన విద్యుత్ చేరువ కానుంది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో ఈ సౌకర్యం వెంచిర్యాల్ గ్రామస్తుల కు అందుబాటులోకి వస్తోంది. మండలంలోని వెంచిర్యాల్, నాగంపేట్, రెంజర్ల, మెండోరా మండలంలోని వెల్కటూర్కు రెంజర్ల సబ్స్టేషన్ నుం చి విద్యుత్ అందేది. నాలుగు గ్రామా ల మధ్య విద్యుత్ సరఫరాలో లో వోల్టేజీ తదితర సమస్యలు తలెత్తేవి. వెల్కటూర్కు మంత్రి సబ్స్టేషన్ మం జూరు చేయించడంతో సమస్యలు తగ్గాయి. వెంచిర్యాల్కు రెంజర్ల నుం చి 15 కిలో మీటర్ల లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుండడంతో లోవోల్టేజీ సమస్య తప్పేది కాదు. 24 గంటల ఉచిత కరెంటుతో వెంచిర్యాల్లో బోరు బావుల కింద పంటల సాగు పెరిగింది. గ్రామ పరిధి లో వంద ట్రాన్స్ఫార్మర్లు, 400 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మంత్రి వెంచిర్యాల్కు సైతం రూ.కోటితో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయించి గత నెల 4న నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో తమకు మరింత నాణ్యమైన విద్యుత్ సేవలు అందనున్నాయని రై తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాం త్రెడ్డికి వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఇవీ కూడా చదవండీ..
కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న కేంద్రమంత్రి హర్షవర్ధన్
గుజరాత్ ఐఐఎంలో 70కి చేరిన కరోనా బాధితుల సంఖ్య