భీమ్గల్, ఏప్రిల్1: బాల్కొండ నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేంత వరకూ తాను విశ్రమించేదిలేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కాళేశ్వరం (ప్యాకేజీ -21)నుంచి 22 చెక్డ్యాములు, చెరువుల ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని అన్నారు. రాజకీయాల కోసం దిగజారి మాట్లాడేవారు తనతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. రెచ్చగొట్టేలా మాట్లాడే బీజేపీ నాయకులు కేంద్రం నుంచి నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి యువకులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. భీమ్గల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను అడిగి రూ.వంద కోట్ల నిధులు తెచ్చినట్లు తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రైతులు, పేదల సంక్షేమం విషయంలో మడమ తిప్పబోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, మాజీ మంత్రి ఎస్. సంతోష్రెడ్డి, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి, మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్,జిల్లా ఆర్టీఏ సభ్యుడు రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం