ఇందల్వాయి: రాష్ట్రంలోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లక్ష రూపాయలను కట్నంగా అందిస్తు ఆదుకుంటున్నారని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలకు మంజూరైన 55 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ భూములకు నీరందక బీడు భూములుగా మారేవని, స్వరాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ను అందిస్తూ రెండు పంటలకు నీరందిస్తున్న ఘనత సీఎందేనన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న సీఎం కేసీఆర్ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శించడం సరైనది కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్నాయక్, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, గడ్డం సుమణ, వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ సత్తెవ్వ, ఎంపీటీసీ సుధాకర్, విండో చైర్మన్ గోవర్ధన్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్, తాసీల్దార్ రమేశ్, ఎంపీడీఓ రాములునాయక్లతో పాటు అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులున్నారు.