నిజామాబాద్ సిటీ: గంగపుత్ర, ముదిరాజ్ కులాల నుంచి ఆరుగురు చొప్పున ప్రతినిధులతో జిల్లా సబ్ కమిటీని ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ రాష్ట్ర సహాయ కమిషనర్ శంకర్ రాథోడ్ వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సొసైటీ ఏర్పాటు, సభ్యత్వం పై దరఖాస్తుల స్వీకరణ కొనసాగిందని, 43కు పైగా గతంలో గంగపుత్రులు, ముదిరాజ్ మత్స్యకారులు చేసుకున్న దరఖాస్తులపై కమిటీ విచారణ చేసిందన్నారు.
ఈ సమావేశంలో అదనంగా ముదిరాజ్, బెస్త, గంగపుత్రుల నుంచి 167 దరఖాస్తులు రాగా అందులో ముదిరాజ్ల నుంచి 107 వచ్చాయని అన్నారు. 12 మందితో సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యసాడ నర్సింగ్, మల్లన్న, సంగమేశ్వర్, రాజేందర్, అబ్బులు, గంగారాం, బట్టు నరేందర్, అన్నయ్య, బోర్గాం శ్రీనివాస్, లింగం, ఉట్నుర్ బాలయ్య, నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.