శక్కర్నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, నాయకులు ఎమ్మెల్యే షకీల్ను ఆయన నివాసంలో శనివారం కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నెహ్రూనగర్ సర్పంచ్ అమానుల్లా షరీఫ్, ఎంఎస్సీ ఫారం సర్పంచ్ విజయ్కుమార్తోపాటు పలువురు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశా రు. చిన్న పంచాయతీలు, నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో నెలకొన్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయ ని, మీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సర్పంచులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వా రిలో అమానుల్లా షరీఫ్, విజయ్కుమార్, రవినాయక్, రాజేందర్రెడ్డి, రాంగోపాల్రెడ్డి ఉన్నారు.
వైద్య చికిత్సకు ఎమ్మెల్యే హామీ
నిజాంషుగర్స్ విశ్రాంత ఉద్యోగి అక్కపల్లి మల్లేశం వైద్య చికిత్సకు ఎమ్మెల్యే షకీల్ హామీ ఇచ్చారు. రెండేండ్లుగా వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న సదరు ఉద్యోగి, కార్మిక సంఘం నాయకుడు రవిశంకర్గౌడ్ ఎమ్మెల్యే షకీల్ను ఆయన నివాసంలో కలిశారు. స్పందించిన ఎమ్మెల్యే ఆయన వైద్యం కోసం నిమ్స్ దవాఖానలో చేర్పిస్తానని, వైద్యానికి అయ్యే ఖర్చును సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్వోసీ అందజేస్తానని హామీ ఇచ్చారు.
పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే..
రెంజల్, జూన్ 12: మండలంలోని దండిగుట్ట, రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో ఇటీవల పలువురు మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే షకీల్ శనివారం పరామర్శించారు. దండిగుట్టలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ, వీరన్నగుట్టలో మాజీ సర్పంచ్ వినోద్, రెంజల్లో మాజీ సర్పంచ్ చందూర్ సవిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
ఉద్యమకారుడి కూతురికి ఎమ్మెల్యే ఔదార్యం..
నీలా గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడి కుమారుడి వివాహ విందుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడు దండి శంకర్ కూతురు వివాహానికి ఎమ్మెల్యే నగదు అందించి తన ఔదార్యాన్ని చాటారు. మండలాధ్యక్షుడు భూమారెడ్డి, సర్పంచులు వికార్పాషా, సాయారెడ్డి, గణేశ్నాయక్, రెంజల్ విండో చైర్మన్ ప్రశాంత్, నాయకులు రఫీయొద్దీన్, మౌలానా, రాఘవేందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఆహ్వానం
రెంజల్ మండలంలోని సాటాపూర్లో రామాలయం పునర్నిర్మాణం చేపట్టనున్నందున భూమి పూజకు రావాలని సర్పంచ్ వికార్పాషా, రామాలయ కమిటీ చైర్మన్ లచ్చేవార్ నితిన్ శనివారం ఎమ్మెల్యే షకీల్ను స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ కవితతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సర్పంచ్ వికార్పాషా తెలిపారు. ఎంపీటీసీ హైమద్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు హజీఖాన్, రైతు బంధు గ్రామ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు, సాయిలు పాల్గొన్నారు.