కమ్మర్పల్లి, జూన్ 20: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా మారిందని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కమ్మర్పల్లి మండలంలోని హాసాకొత్తూర్, కమ్మర్పల్లి, ఉప్లూర్, ఆర్ఆర్. నగర్, నర్సాపూర్, బషీరాబాద్ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను టీఆర్ఎస్ నాయకులు బాధితులకు ఆదివారం పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి రూ.7.37 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ లోలపు గౌతమి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, సర్పంచులు సక్కారం అశోక్, పెండె ప్రభాకర్, ఎంపీటీసీలు మైలారం సుధాకర్, పిప్పెర అనిల్, ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పార్శపు అరుణ్రెడ్డి, ఏనుగు గంగారెడ్డి, హల్దె శ్రీనివాస్, లోలపు సుమన్, నోముల నరేందర్, తోట అప్పయ్య, అహ్మద్ హుస్సేన్, సంత రాజేశ్వర్, ఏలేటి లింగారెడ్డి, పాల్గొన్నారు.
వేల్పూర్లో..
వేల్పూర్, జూన్ 20: మండల కేంద్రానికి చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. గ్రామానికి చెందిన సాట్లపల్లి చిన్న రాజన్నకు రూ.32,500, మోతె నాగేశ్కు రూ.32,500 మంజూరైనట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, ఎంపీటీసీ మొండి మహేశ్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బబ్బురు ప్రతాప్, కుర్మ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.