బోధన్, మార్చి 30: రూ.51 కోట్ల 68 లక్షల 13 వేల ఆదాయపు అంచనాతో 2021-22 సంవత్సరానికిగానూ రూపొందించిన బోధన్ మున్సిపల్ బడ్జెట్ను మంగళవారం నిర్వహిం చిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సర్వసభ్యసమావేశం ఆమోదించింది. ఈ బడ్జెట్ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి అధ్యక్షత వహించగా, అడిషనల్ కలెక్టర్ లత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా గత ఏడాదికి సంబంధించిన సవరణ బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. అనంతరం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న 2021-22 సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలిపారు. మున్సిపల్ బడ్జెట్లో గత ఏడాది బడ్జెట్లో వ్యయాలు పోనూ మిగులు నిల్వ రూ.5 కోట్ల 31 లక్షల 46 వేలను 2021-22 సంవత్సరం బడ్జెట్ ప్రారంభ నిల్వగా చూపించారు. పన్నులు, పన్నేతర వనరుల ద్వారా మున్సిపాలిటీ సాధారణ నిధుల కింద రూ.13 కోట్ల 8 లక్షల 67 వేల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. అలాగే, ప్లాన్, నాన్ప్లాన్ నిధులు, గ్రాంట్స్ ద్వారా మరో రూ.33 కోట్ల 28 లక్షల ఆదాయం వస్తుందని చూపించారు. ఈ విధంగా మొత్తం 51 కోట్ల 68 లక్షల 13 వేల రూపాయల ఆదాయం వస్తుందని అంచనావేశారు. ఈ బడ్జెట్ అంచనాల ప్రకారం బోధన్ మున్సిపాలిటీ జనరల్ ఫండ్కు వచ్చే ఆదాయంలో సింహభా గం ఆస్తిపన్నుదే.. ఆస్తిపన్ను ద్వారా మున్సిపాలిటీకి రూ.7 కోట్ల 10 లక్షల ఆదాయం రానుంది. మిగతా మొత్తం పన్నేతర ఆదాయ వనరుల ద్వారా సమకూరనుంది.
వ్యయాల అంచనా ఇలా..
బోధన్ మున్సిపాలిటీకి 2021-22 సంవత్సరానికిగానూ సాధారణ నిధుల నుంచి రూ.13 కోట్ల 8 లక్షల 67 లక్షలు వ్యయమవుతుందని అంచ నా వేశారు. అలాగే, ప్లాన్, నాన్ప్టాన్ నిధులు, గ్రాంట్ల కింద వచ్చే ఆదాయంలో రూ.33 కోట్ల 23 లక్షలు ఖర్చులు చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఇలా మొ త్తం మున్సిపల్ బడ్జెట్లో వ్యయాలను రూ.46 లక్షల 31 వేల 67 లక్షలుగా చూపించారు. బోధన్ మున్సిపాలిటీకి వచ్చే మొత్తం ఆదాయంలో వ్యయాలను తీసివేయగా మిగిలిన రూ. 5 కోట్ల 36 లక్షల 46 వేల రూపాయలను 2021-22 సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ ముగింపు నిల్వగా పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని గ్రీన్ బడ్జెట్గా ప్రభుత్వం ఆదేశాల మేరకు చూపించామని, గత ఏడాది నుంచి ఈ కొత్త గ్రీన్ బడ్జెట్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. బీసీలు, మైనార్టీలు నివసించే మురికివాడల అభివృద్ధికి, విలీన గ్రామాల అభివృద్ధికి, వార్డులవారీగా సంక్లిష్టమైన పనులకు ప్రత్యేకంగా నిధులను ఈ బడ్జెట్లో కేటాయించామన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి మాట్లాడుతూ.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బడ్జెట్ అంచనాలను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.అడిషనల్ కలెక్టర్ లతకు మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, కౌన్సిలర్లు, అధికారులు సత్కరించా రు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ము న్సిపల్ డీఈ శివానందం, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.