ఖలీల్వాడి, మే 9 : కొవిడ్ బాధితులు, వారి సహాయకులతోపాటు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ఆధ్వర్యంలో ఉచిత భోజన పంపిణీ కొనసాగుతున్నది. మూడోరోజైన ఆదివారం సైతం ప్రత్యేక వాహహనాల్లో భోజన ప్యాకెట్లను తరలించి నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లలో పంపిణీ చేశారు.
మధ్యాహ్నం 12 నుంచి 2గంటల వరకు మొత్తం 1200 మందికి భోజనం అందజేశారు. కరోనా బారినపడి ఐసొలేషన్లో ఉన్న వారు కాల్ సెంటర్ 72073 92708, 72073 92709 నంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలలోగా ఫోన్ చేసి వివరాలు అందజేస్తే భోజనాన్ని హోం డెలివరీ చేస్తామని ఎమ్మెల్యే గణేశ్గుప్తా తెలిపారు.
భోజన వితరణ వాహనాల కూడళ్లు
వినాయక్నగర్ హనుమాన్ జంక్షన్ (72073 92701), వర్ని చౌరస్తా (72073 92702), నెహ్రూ పార్క్ (72073 92703), ఖలీల్వాడి (72073 92704), హమాల్వాడి (72073 92705), కంఠేశ్వర్ టెంపుల్ (72073 92707) కూడళ్లలో భోజన వితరణ కొనసాగుతున్నది.