ఖలీల్వాడి, జూన్ 5: టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేశ్పల్లి ఆనంద్రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత శనివారం హైదరాబాద్లో పరామర్శించారు. ఆనంద్రెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన సంతాప సభను శనివారం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత హాజరై బాధిత కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంతాప సభకు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు ఉన్నారు.