రూ.ఐదు కోట్లతో అధునాతన పరికరాలు
50కి పైగా పరీక్షలు చేసే సామర్థ్యం
నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల
పేదలకు తప్పనున్న వైద్య పరీక్షల భారం
ఖలీల్వాడి, జూన్ 5: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సర్కారు దవాఖానలన్నీ కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా తయారవుతున్నాయి. ఈక్రమంలో నిజామాబాద్లోని జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రూ.ఐదు కోట్ల వ్యయంతో అధునాతన పరికరాలను సమకూర్చారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్గా పిలుస్తోన్న ఈ కేంద్రంలో దాదాపు 50కి పైగా పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా.. ముందు కేవలం 21 రకాల పరీక్షలు మాత్రమే ప్రయోగాత్మకంగా చేయనున్నారు. మిగిలిన పరీక్షలను దశల వారీగా చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో పేద ప్రజలకు దవాఖానల్లో అదనపు ఆర్థిక భారం తగ్గనున్నది. జిల్లాకేంద్రంలో ఉదయం పదిన్నర గంటలకు మంత్రి వేముల డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించనున్నారు.