బోధన్, ఏప్రిల్ 1: కొంతకాలంగా బాన్సువాడకు చెందిన రుద్రంగి మురళీధర్ అనే వ్యాపారి బో ధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ తనకు రంజాన్ తో ఫాలు, క్యాటరింగ్కు సం బంధించి డబ్బులు ఇవ్వడంలేదని, డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడారం టూ దుష్ప్రచారం చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని టీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గం నాయకులు ఆరోపించారు. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సమన్వయ సమితి బోధన్ మండల మాజీ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ గింజుపల్లి శరత్, టీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు డి.సంజీవ్కుమార్, ప్రధాన కార్యదర్శి సాలూరా షకీల్, కోట గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కృష్ణప్రసాద్, నర్సయ్య, శివకాంత్ పటేల్, మాగిరి పోశెట్టి మా ట్లాడారు. ఎమ్మెల్యే షకీల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని రాజకీయ శక్తులు మురళీధర్తో అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేయిస్తున్నాయని, కుట్రను బహిర్గతంచేసి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 2018లో రంజాన్ తోఫాలకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోతే.. 2019లో ఎన్నికల సమయంలో భోజనాల కాంట్రాక్ట్ ఎందుకు చేశావని మురళీధర్ను ప్రశ్నించారు. నిజంగానే ఎమ్మెల్యే షకీల్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలతో రావాలని, అదే నిజమైతే ఎమ్మెల్యే తరపున డబ్బు లు చెల్లిస్తామన్నారు. లేకపోతే, వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంలో పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మె ల్యే తండ్రి ఆజాం అస్వస్థతతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని, బోధన్కు ఆయన వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మాట్లాడుతారని అన్నారు.
ఇవీ కూడా చదవండీ..
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!