ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పురుషుల, మహిళల టోర్నీలో జిల్లా మహిళల జట్టు రన్నరప్గా నిలిచిందని జిల్లా కార్యదర్శి గాదారి సంజీవ్రెడ్డి తెలిపారు. నాకౌట్ పద్ధతిలో జరిగిన టోర్నీలో జిల్లా జట్టు నల్గొండపై విజయం సాధించి సెమిస్ లో హైదరాబాద్తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్ చేరుకుందని ఆయన వెల్లడించారు. ఫైనల్లో రంగారెడ్డితో జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడిందని వివరించారు. జిల్లా జట్టులో సాయిశ్రీ లక్కీరెడ్డి, సాయి ప్రణతి, నితల్ అద్భుత ప్రతి కనబర్చారని తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీహెచ్ఎంసీ క్రీడల అడిషనల్ కమిషనర్ యాదగిరి, సెపక్తక్రా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్.ప్రేమ్రాజ్ చేతుల మీదుగా ట్రోఫిని అందుకుందని తెలిపారు. జిల్లా జట్టుతో కోచ్ బాగారెడ్డి, జి.శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా జట్టు విజయంపై జిల్లా అధ్యక్షులు కేశ వేణు, గడ్డం సతీశ్రెడ్డి , దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, గణేశ్ ,రాజేందర్, సంతోష్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.