ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మియావాకి మొక్కల ప్లాంటేషన్ను ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బుధవారం ప్రారంభించారు. డంపింగ్ యార్డు పరిధిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మియావాకి మొక్కలను పెంచాలని సూచించారు. చెట్లు ఎక్కువ మోతాదులో పెంచడం వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. చెట్లను పెంచడం ద్వారా కాలుష్యం తగ్గుతుందన్నారు.
అనంతరం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లోలం సత్యనారాయణ, ఉపసర్పంచ్ రాము, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్నాయక్, లోలం సర్పంచ్ మమతాశేఖర్, సిర్నాపల్లి సర్పంచ్ తేలు విజయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి పులినివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకట్గౌడ్, డీఎల్పీవో శ్రీనివాస్, మండల ప్రజాపరిషత్ అధికారి రాములునాయక్, కార్యదర్శి అనూష, టీఆర్ఎస్ నాయకులు సాగర్, గ్రామస్తులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.