నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే బాజిరెడ్డి సతీమణి శోభారాణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత నిజామాబాద్లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. శోభారాణి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పులమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఆమె వెంట పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు.