నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం సమీపంలో నిర్మిస్తున్న మార్క్ఫెడ్ కార్యాలయ నిర్మాణ పనులను మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పరిశీలించారు. జీ ప్లస్ వన్ స్థాయిలో నిర్మిస్తున్న మార్క్ఫెడ్ కార్యాలయం వచ్చే రెండు, మూడు నెలల్లో ప్రారంభోత్సవం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మార్క్ఫెడ్ కార్యాలయాలు అందుబాటులో లేవన్నారు.
సీఎం కేసీఆర్ పరిపాలనలో మార్క్ఫెడ్ కార్యకలాపాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు అవుతుండటం సంతోషకరమని గంగారెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో కలిసి నిజామాబాద్ కార్యాలయ పనులను పరిశీలించిన ఆయన కార్యాలయం నిర్మాణంలో మార్పులు చేర్పులపై సలహాలు సూచనలు అందించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రైతు అనుకూల విధానాలు అమలు అవుతున్నాయని మార గంగారెడ్డి చెప్పారు. గతంలో పంటల సాగుకు కర్షకులు అనేక ఇబ్బందులు పడేవారని ఇప్పుడు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ నూతన భవన నిర్మాణానికి దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కంగనా పరువాల విందు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
గ్రానైట్ లారీని ఢీ కొట్టిన డీసీఎం..దగ్ధమైన వాహనాలు
సిద్ధాపూర్లో గంజాయి మొక్కలు ధ్వంసం
థియేటర్స్లోకి రాబోతున్న మరో రెండు సినిమాలు