ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్తో పాటు , మండలంలోని 18 గ్రామాల్లో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్చైర్మన్ షేక్ మున్నా, మున్సిపల్ కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, సంగీత ఖాందేష్, ఆర్మూర్ తెలంగాణ జాగృతి నియోజకవర్గ అధ్యక్షులు మక్కల సాయినాథ్, 6వ తర్ప పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మ్యాక మోహన్దాస్, బీజేపీ నాయకులు పెద్దోల్ల గంగారెడ్డి, జెస్సు అనిల్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు.
మండలంలో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్లు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆర్మూర్లోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు.