డిచ్పల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని ఖిల్లా డిచ్పల్లి రామాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రులకు చక్రతీర్థం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతాసమేతంగా స్వామివారు వన విహారం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిత్యహోమం, అవభృతస్నాన కార్యక్రమాలు, సాయంత్రం గజసేవ, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో జాతరలో వివిధ దుకాణాలు ఏర్పాటు చేయగా.. భక్తులతో సందడిగా మారింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఖిల్లారామాలయ చైర్మన్ పొద్దుటూరి మహేందర్రెడ్డి, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ఆసది రవీందర్, ఎంపీటీసీ కొత్తూరు మానస సాయి, విండో చైర్మన్ గజవాడ జైపాల్, వీడీసీ కోశాధికారి బూస నర్సయ్య (బక్కన్న), రైటర్ గట్టావలి సాగర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.