బాల్కొండ, సెప్టెంబర్ 15: బాల్కొండ సర్వతోముఖాభివృద్ధే తన ధ్యేయమని రాష్ట్ర రో డ్లు, భవనాలు, గృహ నిర్మా ణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రూ. తొమ్మిది కోట్ల వ్యయంతో బాల్కొండ మం డల కేంద్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గురువారం ఆయన బాల్కొండ మండల కేంద్రం లో పలు సుందరీకరణ పనులు, సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
సెంట్రల్ లైటింగ్తో మండల కేంద్రం కొత్తశోభను సంతరించుకున్నదని అన్నా రు. అనంతరం సెంట్రల్ లైటింగ్ ప్రారంభం సందర్భంగా బాల్కొండ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. బాల్కొండను ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.