కమ్మర్పల్లి, అక్టోబర్ 7 : ఎవరెన్నీ కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృ హ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బాల్కొండ నియోజక వర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం మంత్రి వేముల ఆధ్వర్యంలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా వారితో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హై దరాబాద్లో తన నివాసంలో సమావేశం నిర్వహించి మునుగోడులో ప్రచారానికి సంబంధించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మునుగోడులో ప్రజల్లోకి వెళ్లి వివరించాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి అనురించాల్సిన వ్యూహాల పై చర్చించారు. ఎక్కడా లేని విధంగా..దేశమంతా తమకూ కావాలనే విధంగా సీ ఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ అందుతున్నాయన్నా రు. ఈ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.విపక్షాల కుట్రలు, అసత్య ప్రచారాలను బలంగా తిప్పికొట్టాలన్నారు. మునుగోడుకు తరలివెళ్లిన వారిలో బాల్కొండ నియోజక వర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.