నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 5 : తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా బుధవారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించే దృశ్యాలను ప్రజలు టీవీల్లో ఆసక్తిగా తిలకించారు. ప్రధాన కూడళ్ల వద్ద పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేయడంతోపాటు పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ.. జయహో కేసీఆర్ నినాదాలు హోరెత్తాయి.
తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్తోనే బంగారు భారతం సాధ్యమని తెలంగాణ ఉద్యమ నాయకురాలు, కోటగిరి మాజీ సర్పంచ్ స్వరూప అన్నారు. కోటగిరిలోని పోచారం కాలనీలో మహిళలు బీఆర్ఎస్ ప్లకార్డులతో ‘జయహో కేసీఆర్’.. ‘దేశ్ కీ నేత కేసీఆర్’.. నినాదాలు చేశారు. కోటగిరిలో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పటాకులు కాల్చారు. పొతంగల్, ఎత్తొండ, కల్లూర్తో పాటు వివిధ గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. మండల నాయకులు శంకర్ పటేల్, వల్లెపల్లి శ్రీనివాస్, తేళ్ల అరవింద్, ఎజాజ్ఖాన్, కిశోర్బాబు, సర్పంచులు పత్తి లక్ష్మణ్, సాయిబాబా, వోలే లక్ష్మి, వర్ని శంకర్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్ధు, అనిల్ కులకర్ణి, జుబేర్, మధు, నజీర్, చోటేమియా, రఫీ తదితరులు పాల్గొన్నారు.
వర్ని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పదాన్ని పూలతో ఏర్పాటు చేసి పటాకులు కాల్చారు. బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్ మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం సంతోషంగాఉందన్నారు. మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, శ్రీనగర్ సర్పంచ్ రాజు, ఏఎంసీ డైరెక్టర్ గఫార్, బీ(టీ)ఆర్ఎస్ నాయకులు వంకా నాగేశ్, సతీశ్, మేక బుజ్జి, గఫార్, అహ్మద్, లల్లూ, నామాల బుజ్జి, రాము పాల్గొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శేఖర్, నాయకులు హన్మంత్రెడ్డి, జీయర్ కిశోర్రెడ్డి, సురేందర్గౌడ్, పుప్పాల సుభాష్, పోతరాజు, లింబాద్రి, భాస్కర్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, ఎస్పీ లింగం, గంగాదాస్, లింబాద్రి, సర్పంచ్ శర్మన్నాయక్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలం మల్లారంలో బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సర్పంచ్ నగేశ్, విండో మాజీ చైర్మన్ బాల్రాజ్, బీ(టీ)ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గాజుల శంకర్ పాల్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు.. భారతదేశం మొత్తం అవసరమని ప్రజలు భావిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు చిలువేరి గంగాదాస్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాశం కుమార్, బిరీశ్, రజినీకాంత్, గంగాధర్, గంగాదాస్, శేఖర్, శ్రీనివాస్ ఉన్నారు.
మోస్రాలో బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, పిట్ల ఉమా శ్రీరాములు ఆధ్వర్యంలో, చందూర్లో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.
జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఎంపీపీ కుంచాల విమలరాజు ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీ (టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, ఎంపీటీసీ సభ్యుడు గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, జక్రాన్పల్లి సర్పంచ్ జక్కం చంద్రకళా బాలకిషన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అక్బర్ఖాన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు డీకొండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, మాజీ వైస్ ఎంపీపీ జితేందర్నాయక్, నాయకులు బాలకిషన్, ఆర్మూర్ గంగారెడ్డి, గడ్డం గంగారెడ్డి, సతీశ్, అక్బర్ఖాన్, జితేందర్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మోపాల్ మండలకేంద్రంలో బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కన్నేరామ్, సిదార్థ, నిమ్మల మోహన్ రెడ్డి, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్లోని బస్టాండ్ వద్ద బీ(టీ)ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, బీ(టీ)ఆర్ఎస్ మండల కార్యదర్శి బాలరాజు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారాం, సిద్ధ్దాపూర్ సర్పంచ్ లక్ష్మణ్, నాగభూషణం పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సూచన మేరకు సంబురాలను ఘనంగా నిర్వహించారు. ధర్నాచౌక్ వద్ద గులాబీ శ్రేణులు పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. బ్యాండు వాయిద్యాల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్.. జై కేసీఆర్’ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రెడ్ కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, మాజీ మేయర్ ఆకుల సుజాత, నాయకులు సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సూదం రవిచందర్, సిర్ప రాజు, దండు శేఖర్, ఎనుగందుల మురళి, మీర్ మజాజ్ అలీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.