మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఎస్కెప్ గేట్లనుంచి గోదావరిలోకి 15వందల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 6000,సరస్వతి 800,లక్ష్మి కాలువకు 150, వరద కాలువకు9746 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని వెల్లడించారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు(90.313 టీయంసీలు)గాను శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1090.90 అడుగులు(89.763 టీయంసీల)నీటి నిల్వ ఉందన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 330.128 టీయంసీల వరద నీరు వచ్చిచేరిందని ఆయన పేర్కొన్నారు.