ఖలీల్వాడీ, మార్చి 24 : క్షయ వ్యాధి నిర్మూలనలో నిజామాబాద్ జిల్లాకు జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ రాగా.. జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) సుదర్శనం అందుకున్నారు. జిల్లా క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో క్షయ నిర్మూలన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, 60 శాతం నూతన టీబీ కేసులను తగ్గించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు జాతీయస్థాయిలో బంగారు పతకం ప్రకటించారు. శుక్రవారం క్షయ వ్యాధి ని వారణ దినోత్సవం సందర్భంగా వారణాసిలో కేం ద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్వో సుదర్శనం గోల్డ్ మెడల్ను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టీబీ జిల్లా సమన్వయకర్త రవిగౌడ్ హాజరయ్యారు.
క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు వరుసగా మూడేండ్లుగా జాతీయస్థాయిలో అవార్డులు రావడం ఆనందంగా ఉందని డీఎంహెచ్వో సుదర్శనం పేర్కొన్నారు. నిజామాబాద్ను క్షయరహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడానికి చేసిన కృషిలో భాగస్వామ్యమైన క్షయ నియంత్రణ విభాగం సిబ్బంది ఆశ కార్యకర్తలు, రెడ్క్రాస్, సూర్యహెల్త్ ఆర్గనైజేషన్, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.