నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్లో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని హత్య చేసాడు భర్త. రుద్రూర్కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్ భార్యాభర్తలు. వారికి ఒక కూతురకు ఉన్నది. కాగా, భార్య మల్లీశ్వరిపై అనుమానం పెంచుకున్నాడు గంగాధర్. గత కొన్ని రోజులుగా ఆమెను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన గంగాధర్ ఇంట్లో ఉన్న గొడ్డలితో మల్లీశ్వరి, కూతురు రుత్వికను తలపై నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఏసీపీ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వివాహేతర సంబంధ కారణంగా ఈ హత్యలు జరిగినట్లు స్థానికులు చెప్పారు.