ఇందూరుః నిజామబాద్ నగరంలోని సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షులు బంటు గణేశ్ ఆధ్వర్యంలో గణేశ్ శోభాయాత్రను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్, స్థానిక కార్పొరేటర్ జెండా ఊపి ప్రారంభించారు. నవరాత్రులు పూజలందుకున్న గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతికి హారతినిచ్చి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం చతుర్థిని పురస్కరించుకుని శోభాయాత్రను డప్పు,వాయిద్యాలు. ఎడ్ల జతలు రథాన్ని లాగాయి. రథయాత్ర దుబ్బ చౌరస్తా నుంచి ప్రారంభం కాగా, ప్రభాత్ థియేటర్, లలిత మహాల్, రైల్వేగేటు, గాంధీ గంజ్, 1వ టౌన్, గాంధీచౌక్, నెహ్రూపార్కు, పవన్ థియేటర్ రస్తా, బర్కత్పుర, గురుద్వారాచౌరస్తా, పెద్దబజార్చౌరస్తా, గోల్హనుమాన్, పాటిగల్లీ, పూలాంగ్ రస్తా, వినాయక్నగర్ వినాయకుల బావిలో నిమజ్జనం చేశారు.
దారిపొడవున ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ సీఐ చందర్రాథోడ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ను పోలీసులు మళ్లించారు. రథయాత్ర కొనసాగే మార్గాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వినాయక్నగర్ ప్రాంతంలో గల గణపతి నిమజ్జన బావిలో విసర్జించడానికి గణనాథుల ప్రతిమలను తీసుకురావడంతో వినాయక్నగర్ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. మున్సిపల్ సిబ్బంది బారికేడ్లు నిర్మించారు. ఈ శోభాయాత్రలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, నాయకులు, కుల సంఘాల సభ్యులు యువకులు పాల్గొన్నారు.