కోటగిరి: అర్హులైన పేదోళ్లకు డబుల్ బెడ్రూం ఇంటిని ప్రభుత్వం కేటాయిస్తున్నదని కోటగిరి జెడ్పీటీసీ శంకర్పటేల్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో జంగం గంగామణి నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇంటిని జెడ్పీటీసీ శంకర్పటేల్ సర్పంచ్ పత్తి లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి నియోజకవర్గానికి 10 డబుల్ ఇండ్లు మంజూరు చేయించిన ఘనత స్పీకర్కు దక్కిందన్నారు.
మరో 5వేల ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్ధూ, సైలంపూర్ హౌగిరావుపటేల్, ఏఎంసీ డైరెక్టర్ నజీర్, మైనార్టీ మండల నాయకులు బాబుఖాన్, జుబేర్ తదితరులు వున్నారు.