ఏర్గట్ల: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందువరుసలో నిలుస్తామని ఎంపీపీ కోలిపాక ఉపేందర్రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం అన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీ వాడలో లక్ష వ్యయంతో తలపెట్టిన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్రెడ్డితోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ జక్కని మధుసూదన్, సొసైటీ చైర్మన్ బర్మ చిన్ననర్సయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సున్నపు అంజయ్య, సొసైటీ వైస్ చైర్మన్ గంగారాం, పార్టీ మండల నాయకులు తుపాకుల శ్రీనివాస్గౌడ్, జైనుద్దీన్, సహదేవ్, రాజేశ్వర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మోహన్, వార్డు సభ్యురాలు మమత, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.