డిచ్పల్లి : తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం హైదరాబాద్లో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయమే చిన్నజీయర్ స్వామి వారి నివాసంలో స్వామివారిని కలిశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్కు తీర్థప్రసాదాలు, పండ్లు ఫలాలను అందించి ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, తదితరులు ఉన్నారు.
కాగా చైర్మన్గా తొలిసారి ఆదివారం సొంత జిల్లా నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.