డిచ్పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సహాచార్యుడు డాక్టర్ బాల శ్రీనివాసమూర్తి తన తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని దివంగత లక్ష్మీనర్సింహశర్మ జీవిత విశేషాలపై రచించిన ‘జీవన హిందోళం’ అన్న పుస్తకాన్ని వైస్ ఛాన్స్లర్ ఆచార్య డి.రవీందర్కు బహూకరించారు. ప్రసిద్ధ సాహితీవేత్త తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి పీఠికతో కూడిన జీవన హిందోళం గ్రంథాన్ని ఇటీవల ప్రచురించారు. ఈ రచన పలువురు సాహిత్యాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నది.