శక్కర్నగర్: బోధన్ పట్టణంలోని బోధన్- రద్రూర్ వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్ను ఈనెల 30 నుంచి మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ ఏడీఈ నాగభూషణం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బోధన్ ఆర్డీవో, మున్సిపల్శాఖతో పాటు పోలీస్ అధికారులకు అందజేశారు.
మరమ్మతుల కారణంగా ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 3వరకు రైల్వేగేట్ గేట్లు మూసివుంటాయని పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని.. వాహనదారులు బైపాస్ మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు. పట్టణంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు కొనసాగే మరమ్మతులకు సహకరించాలని కోరారు.