ఖలీల్వాడి: అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో ఎం.సుదర్శనం అన్నారు. శుక్రవారం జిల్లా సారంగాపూర్లో టీబీ, ఎయిడ్స్ నియంత్రణ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపిస్తుందని తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ వ్యాధి పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం కోఆర్డినేటర్ రవిగౌడ్ మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తున్నదని చెప్పారు. రోగి చికిత్స సమయంలో తనకు పొందాల్సిన అవసరాలను వివరించారు. ఎయిడ్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధాకర్ కండోమ్ జాగ్రత్తల గురించి చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ సాయికిరణ్, జైలు మెడికల్ ఆఫీసర్ మోహన్రెడ్డి, పీఆర్ కోఆర్డినేటర్ అశోక్, వరలక్ష్మి, యాహియా, సోమశేఖర్, ఖైదీలు పాల్గొన్నారు.