హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్టిండాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో ఉండగా కళ్యాణ్ చెట్టుపై నుంచి జారిపడ్డాడు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలించి మృతిచెందాడు. కళ్యాణ్రావు స్వస్థలం మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకునే అవకాశం.