ఆర్మూర్: నులిపురుగుల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆర్మూర్ పట్టణ ఆరోగ్య పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31 వరకు పట్టణంలోని వివిధ వార్డుల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మాత్రలతో చిన్నపిల్లలకు వచ్చే కడుపునొప్పి, రక్తహీనత, బలహీనత వంటి లక్షణాలు దరిచేరవన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లతోపాటు ఆశలకు, ఏఎన్ఎంలకు బుధవారం శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య వైద్యాధికారి అయేషా, సుధీర్బాబు, అంగన్వాడీ టీచర్లు, ఆశలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.