న్యూఢిల్లీ: ఈ-ఫార్మసీని నియంత్రించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనున్నది. దేశంలోని బ్రిక్ అండ్ మోర్టార్ ఫార్మసీలను రక్షించడానికి ఈ-ఫార్మసీల నియంత్రణకు రూపొందించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఆరోగ్య, వాణిజ్య మంత్రిత్వశాఖలు సంప్రదింపులు జరిపాయని సమాచారం.
2018 నుంచి ఈ-ఫార్మసీల రిజిస్ట్రేషన్పై చర్చలు జరుగుతున్నాయి. అదే ఏడాది డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ నిబంధనలు-1945కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ విషయమై గత వారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
ఫిజికల్ ఫార్మసీల మాదిరిగానే ఈ-ఫార్మసీల నిర్వహణకు నిబంధనలు రూపొందించాలని కేంద్రం భావిస్తున్నది. ఈ-ఫార్మసీలకు పలు రాయితీలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో ఫార్మాస్యూటికల్ ఔషధాలు, ఈ-ఫార్మసీలపై నియంత్రణ లేదు.
కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ-ఫార్మసీలకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలోకి మరింత పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా నిబంధనలు, నియంత్రణలతో కూడిన విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్రం భావిస్తున్నది.
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!