ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియన్ స్థాయిలో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగ్ను త్వరలో తిరిగి మొదలుపెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ సినిమా మైసూర్ నేపథ్యంలో 1970 బ్యాక్డ్రాప్లో సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా వింటేజ్ బైక్ను ప్రభాస్ కోసం చిత్రబృందం ప్రత్యేకంగా సిద్ధంచేసినట్లు తెలిసింది. యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలను హాలీవుడ్ సినిమాలకు ధీటుగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రశాంత్నీల్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నాయిక వాణీకపూర్ను ఎంపికచేసినట్లు సమాచారం. వచ్చే ఈ ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.