కోటపల్లి, జూలై 5: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు అన్నా రు. కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయ న సందర్శించి వైద్యాధికారి సత్యనారాయణకు పలు సూచనలు చేశారు. వర్షాలు కురుస్తున్నందు న వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. గ్రామాల్లో జ్వర లక్షణాలు కనిపిస్తే కరో నా పరీక్షలు చేయడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హెల్త్ సూపర్వైజ ర్లు జ్యోతి, శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
వేమనపల్లి, జూలై 5: గ్రామాల్లో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు అ న్నారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మందులు, ఇతర సామగ్రి ని సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామా ల్లో క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు మెరుగైన వైద్య సేవలందించాలని, చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని సూచించారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వై ద్యాధికారి కృష్ణ, ఇన్చార్జి సూపర్ వైజర్ రాంశెట్టి బాపు, ల్యాబ్ టెక్నీషియన్ సౌందర్య, హెల్త్ అసిస్టెంట్లు లింగయ్య, చారి ఉన్నారు.
నియంత్రణపై అవగాహన కల్పించాలి
చెన్నూర్, జూలై 5: జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు అన్నారు. ప్రపంచ జనాభా ది నోత్సవ మాసోత్సవాల సందర్భంగా జనాభా ని యంత్రణకు తీసుకోవాల్సిన పద్ధతులపై చెన్నూర్ క్లస్టర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డా క్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్యులు అరుణ శ్రీ, సత్యనారాయణ, రజనీ, కే కృష్ణ, సబ్ యూనిట్ అధికారి పుట్ట సత్యనారాయణ, హెచ్ ఈవో జగదీశ్, ఎస్వో వెంకటేశ్వర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.