మదనాపురం, జూన్ 19 : మండలంలోని అగ్రహారం(గోవిందహళ్లి) గ్రామంలో ఆంజనేయ విగ్ర హ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రా మానికి చెందిన యాదయ్య, అతడి మిత్రుడు జూప ల్లి వేణుగోపాల్తో కలిసి సుమారు రెండు లక్షల ఖర్చుతో సీతారాముల విగ్రహాలతో పాటు లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను, పల్లకి, దేవతా మూర్తులకు పట్టు వస్ర్తాలను సర్పంచ్ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ ఆంజనేయులు వేదపండితులు గోపాలకృష్ణకు అందజేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం జరిగే అంజనేయస్వామి వారి ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతయ్య, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.