రెండేండ్లకు తల్లి చెంతకు..

కనబడకుండా పోయిన బిడ్డకోసం ఏకధారగా ఏడ్చిన ఆ కన్నపేగుకు రెండేండ్లకు దుఃఖం తీరింది. తప్పిపోయిన బిడ్డ తిరిగి ఒడికి చేరడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రెండేండ్ల క్రితం గుంటూరు నుంచి తప్పిపోయిన ఎనిమిదేండ్ల బాలుడు బోధన్కు చేరాడు. సోషల్ మీడియా పుణ్యమా.. అని తన బిడ్డ ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న తల్లి బుధవారం బోధన్కు చేరుకుంది. అధికారుల సమక్షంలో చాంద్పాషా అనే వ్యక్తి కొడుకును తల్లికి అప్పగించారు.
శక్కర్నగర్: రెండేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లినపోయిన బాలుడు తల్లి చెంతకు చేరాడు. గుంటూరు జిల్లా అచ్చంపేట్ మండల కేంద్రానికి చెందిన పాలపర్తి మగ్లాలి-శ్రీనివాస్ దంపతుల కుమారుడు సాలమన్రాజ్ రెండేండ్ల క్రితం గుంటూరు నుంచి నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చేరుకున్నాడు. బోధన్లోని గోశాల ప్రాంతానికి చెందిన చాంద్పాషాకు ఈ బాలుడు బస్టాండ్ ప్రాంతంలో కనిపించాడు. బాలుడి వివరాలు అడిగినా సరిగా చెప్పలేదు. దీంతో బాలుడి వివరాల కోసం పలుమార్లు ఫేస్బుక్, వాట్సాప్లో పోస్ట్ చేశాడు. బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లి బుధవారం బోధన్ పట్టణానికి చేరుకున్నది. స్థానిక శ్రీసాయి ఆదర్శ యువతి మహిళా మండలి అధ్యక్షురాలు టి. పద్మాసింగ్, అంగన్వాడీ కార్యకర్త పుష్ప ద్వారా చాంద్పాషా ఇంటికి చేరుకున్నారు. బాలుడు కూడా తన తల్లిని గుర్తుపట్టడంతో పోలీసుల సమక్షంలో తల్లికి అప్పగించారు. రెండేండ్ల అనంతరం కుమారుడు దొరకడంపై తల్లి ఆనందం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
- మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు
- పాలమూరు కోడలిని ఆశీర్వదించండి
- ‘ప్రగతి’ పనుల్లో జిల్లా ముందుండాలి
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!