కాచిగూడ,జూన్ 17: నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని కుద్భిగూడలో రూ.13 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్ పనులను గురువారం కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం పలు బస్తీలలోని స్థానికులు వీధి దీపాలు, డ్రైనేజీ, సీసీ రోడ్లలతో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో నీటి కాలుష్య సమస్యను శాశ్వతంగా పరిష్కారంతో పాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమం లో మాజీ ఫ్లోర్లీడర్ దిడ్డి రాంబాబు,కన్నె రమేశ్యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల రవీందర్యాదవ్, ఓం ప్రకాశ్యాదవ్, బీమాగౌని కృష్ణాగౌడ్, జలమండలి జీఎం.బి.మహేశ్, డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ మ హేందర్రెడ్డి, రమాదేవి, ఎర్ర భీష్మా, సుభాష్పటేల్, నాగరాజుగౌడ్, మన్నె శ్రీనివాస్యాదవ్, పెంటం రమేశ్, రాజేశ్, బాబు,శ్రీకాంత్,క్షీర్సాగర్, రవియాదవ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక, జూన్ 17: నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్న పాదయాత్రల ద్వారా స్థానిక సమస్యలకు మోక్షం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గురువారం గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ లంకలో ఆయన పలు శాఖల అధికారులతో కలసి పాదయాత్ర నిర్వహించారు. స్ధానికులను అడిగి ఆయన సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా బస్తీలో మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ల ఏర్పాటు పనులతో పాటు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జలమండలి అధికారులు రోహిత్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు కూలి నిరాశ్రయులైన ఓ కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆర్థిక చేయూతనందించారు. ఇటీవల కురిసిన వర్షానికి అంబర్పేట డివిజన్ బాపునగర్కు చెందిన బాలమణి ఇల్లు కూలిపోయింది. ఈ విషయాన్ని కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే గురువారం గోల్నాకలోని ఆయన కార్యాలయంలో బాలమణి కుటుంబానికి రూ.10వేల నగదు సాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు