ఖలీల్వాడి, జూన్ 17 : నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి అన్నారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఎదుట సెంట్రల్ మీడియన్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.కోటీ 62 లక్షలతో అభివృద్దికార్యక్రమాలు చేపట్టాలని నుడా బోర్డు మీటింగ్లో నిర్ణయించినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు రూ.10 లక్షలతో టీగ్రార్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గంగస్థాన్ ఫేజ్-2లో ఒకటిన్నర ఎకారాల్లో రూ.40 లక్షలతో పార్కు ఏర్పాటు, కాలూర్ ఊర చెరువు కట్ట సుందరీకరణకు రూ.75 లక్షలు, అలీసాగర్ ఫిల్టర్ బెడ్ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.35 లక్షలు కేటాయించినట్లు వివరించారు. మాధవనగర్ నుంచి నడిపల్లి వరకు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని, వివిధ పనుల కోసం రూ.రెండు లక్షలు కేటాయించామన్నారు.
అర్వింద్ చేసిందేమీ లేదు..
రైతులను మోసం చేసి ఎంపీ పదవిని దక్కించుకున్న అర్వింద్ రెండేండ్లలో చేసిందేమీ లేదని ప్రభాకర్రెడ్డి విమర్శించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను పట్టించుకోని అర్వింద్ నుడా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ మంత్రిగా పనిచేసిన కాలంలో నిజామాబాద్కు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయనకు రాజ్యసభ సీటు టీఆర్ఎస్ ఇచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నుడా డైరెక్టర్, నిజామాబాద్ రూరల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా ప్రత్యేక కృషితో నిజామాబాద్ సుందరనగరంగా మారిందన్నారు. హైదరాబాద్ తర్వాత స్థానంలో నిజామాబాద్ ఉందన్నారు. నుడాను విమర్శించే ముందు పసుపు బోర్డుపై మాట్లాడాలని అర్వింద్కు హితవు పలికారు. సమావేశంలో సీపీవో శ్యామ్కుమార్, సాగర్, అడ్వైజరీ కమిటీ సభ్యులు అక్తర్, రాజేశ్వర్, సంతోష్, మధు, రమేశ్, రాజేంద్రప్రసాద్, అంబదాస్, మల్లేశ్గుప్తా, సాయారెడ్డి పాల్గ్గొన్నారు.