జగిత్యాల, జూన్ 16: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాన్ని 30శాతం పెంచడం పై జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30శాతం గౌరవ వేతనం పెంచడంపై ముఖ్యమం త్రి కేసీఆర్కు, వేతనాల పెంపునకు కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, విద్యాసాగర్ రా వు, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జడ్పీటీసీ సభ్యులు దురిశెట్టి లావణ్య, నాగం భూమయ్య, పునుగోటి ప్రశాంతి, బత్తిని అరుణ, మేడిపల్లి మనోహర్ రెడ్డి, కొండపల్కల రాంమోహన్ రావు, సంగెపు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, జూన్ 16 :తెలంగాణ ప్రభు త్వం ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచడంపై మండల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ, జడ్పీసభ్యులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపెల్లి మనోహర్ రెడ్డి, వైస్ఎంపీపీ సొల్లు సురేందర్, మండల రైతుబంధు సమి తి కన్వీనర్ కోల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు గు ర్రాల రాజేందర్ రెడ్డి, ఎడమల జయ, భుక్య లా వణ్య రాథోడ్, డిల్ల్లీ రామారావు, నాయకులు ఎడమల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల, జూన్ 16: పట్టణంలోని ఎమ్మెల్యే క ల్వకుంట్ల విద్యాసాగర్రావు క్యాంపు కార్యాల యంలో బుధవారం ప్రజాప్రతినిధులు సంబురా లు జరుపుకున్నారు. ఈసందర్బంగా జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు 30 శాతం గౌ రవ వేతనాన్ని పెంచుతూ సీఎం తీసుకున్న నిర్ణ యంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తె లిపారు. అనంతరం సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగ ర్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, జిల్లా సర్పం చుల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, జ డ్పీటీసీ సభ్యురాలు దారిశెట్టి లావణ్య, సర్పంచు లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.